Feb 13, 2011

అనగా అనగా...ఒక కథ


రవీంద్రుని నూటయాభయ్యవ జయంతి ఉత్సవాల సంధర్భంగా ,
సంబరాలు జరుపుకుంటున్న మనం ,
ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకోవల్సిన విషయం ఒకటి ,
ఆయనలో నిండి ఉన్నది.
అది విశ్వకవికి పిల్లలతో ,పిల్లల కాల్పనిక ప్రపంచంతో ముడిపడిన బంధం.
శాంతినికేతనం పూదోటల్లో వెల్లివిరిసిన పిల్లల విద్యాప్రయత్నాల విశేషాలు మనకు  తెలిసినవే .
ఒకసారి విదేశీపర్యటనలో ఉన్నప్పుడు ,వారి తొమ్మిదేళ్ళ మనవరాలికి ,రవీంద్రులు ఒక ఉత్తరం రాశారు.

అందులో అంటారు కదా, 
"ఇక్కడ చాలా మంది నన్ను కలవడానికి వస్తున్నారు. నన్ను చుట్టేస్తున్నారు. 
నాకు ఎక్కడికైనా సంతోషంగా మాయమై పోవాలనిపిస్తుంది. నన్ను నీ బొమ్మల గూటిలో దాచిపెడతావా?"
( 8 మే,1930)
చిన్న పిల్లవాడిలా మరో చిన్నారిని అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలోని ..పదాల పసితనం వెనుక .. ఎంతటి లోతైన భావన దాగిఉన్నదో కదా!
విశ్వవిఖ్యాతిని చుట్టుముట్టిన కీర్తిప్రతిష్టలు ,ఉక్కిరిబిక్కిరి చేయబోగా ,ఆయన పసితనంలో తన పచ్చదనం వెతుక్కున్నారు.
పిల్లలలోకం తలుపులు తట్టి ..పిల్లలకోసం అనేక రచనలు చేశారు.
పిల్లల గురించి ఆయన రాసిన ఒక కథను ,శ్రీ మధురాంతకం రాజారాం గారు,నా మొదటి కథాసంకలనం "నేనొ నాన్ననవుతా"కు కస్తూరి తిలకం దిద్దుతూ ..ఇలా ప్రస్తావించారు.
"చదువులు నేర్చిన రామచిలక" అన్న పేరుతో రవీంద్ర కవి ఒక కథను రచించారు. ఒక రాజు గారు తన పెంపుడు చిలకకు పరిపూర్ణ పాండిత్యం అబ్బాలన్న కోరికతో శాస్త్రగ్రంథాలన్ని టికీ  రోటిలో వేసి ,దంచి ఆ కషాయాన్ని చిలక చేత త్రాగిస్తారు.
దాని గతి ఏమై ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది తల్లిదడ్రులు తమ పిల్లలను జాతీయ -వీలయితే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతికెక్కాలన్న తపనతో ," చైల్డ్ ప్రాజిడీలు"గా మార్చే ప్రయత్నంలో ,పుస్తకాల బరువుతో ,కాన్వెంటు చదువులతో ,ట్యూషన్ పాఠాలతో ,దిగద్రొక్కి ,బాల్యజీవనంలోని ఆనందాలన్నిటినీ హరిస్తూ .పీల్చి పిప్పి చేస్తున్నారు .
ఇది ఆత్మహత్యాసదృశ్యమైన అపచారం.
అలాంటి వారికి ఘాటైన చురకలాంటి కథానిక ఒకటి సంపుటిలో ఉంది"
( మధురాంతకం రాజారాం,1 నవంబరు ,1996)
కథానికనే నేను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను.
దీనిని ఆంధ్రజ్యోతి ఆదివారం "వారు నవంబరు 1996లో అచ్చు వేయగా,డా.CLL జయప్రద గారు ఆంగ్లంలోకి అనువదించగా,"సారస "సాహిత్యపత్రికలో అచ్చు వేశారు .
కథను మీ ముందు ఉంచే అవకాశం ఇచ్చిన ,కేంద్ర సాహిత్య అకాడెమి వారికి,లేఖిని అధ్యక్షులు డా.వాసాప్రభావతి గారికి,పొత్తురి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు.

***

 *అనగా అనగా *

2011 ఫిబ్రవరి 11,12 తేదీలలో రవీంద్ర భారతి ,హైదరాబాదు నందు కేంద్ర సాహిత్య ఆకడెమీ వారు నిర్వహించిన "విశ్వకవి రవీంద్రనాథ టాగూర్ 150వ జయంతి నివాళి ,అఖిలభారతి తెలుగు కథానికా రచయిత్రుల మహాసభ" లలో,

11 న చదివిన "అనగా అనగా " అన్న   కథను ఇప్పుడు ఇంగ్లీషులోనూ చదవవచ్చును.


http://chandralata.blogspot.com/2009/12/blog-post.html

ఇవి కూడా చూడవచ్చేమో ..
http://chandralata.blogspot.com/2009/07/blog-post.html
http://chandralata.blogspot.com/2009/07/being-famous.html
***
ఈ ఫోటో తీసిన స్నేహితురాలు కుప్పిలి పద్మగారికి  అభిమానాలు.
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment